క్రీడాభూమి

ఆదుకున్న రూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, నవంబర్ 16: జో రూట్ సెంచరీతో ఆదుకోవడంతో, శ్రీలంకతో రెండో టెస్టులో తలపడుతున్న ఇంగ్లాండ్ మ్యాచ్ మూడో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 324 పరుగులు చేయగలిగింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు సాధించి, 46 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్ ఆడి పరుగుల ఖాతాను తెరవలేకపోయంది. ఇదే ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను కొనసాగించింది. జో రూట్ 124, రొరీ బర్న్స్ 59, బెన్ ఫోక్స్ 51 చొప్పున పరుగులు చేశారు. ఇప్పటి వరకొ లంక కంటే ఇంగ్లాండ్ 278 పరుగులు ముందంజలో ఉంది. ఇంకా ఒక వికెట్ మాత్రమే మిగిలింది. మ్యాచ్‌కి మరో రెండు రోజులు ఉండడంతో ఫలితం తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ.