క్రీడాభూమి
తాయ్కి సింధు షాక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గాంగ్జూ, డిసెంబర్ 13: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తాయ్ జూ ఇంగ్కు భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షాకిచ్చింది. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టూర్ ఫైనల్స్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆమె తాయ్ని 14-21, 21-16, 21-18 తేడాతో ఓడించింది. మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ, ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఎదురుదాడికి దిగిన సింధు తన ప్రత్యర్థితో హోరాహోరీ పోరాటాన్ని కొనసాగించి, విజయభేరి మోగించింది. మొదటి మ్యాచ్లో జపాన్కు చెందిన అకానే యమాగూచీని 24-22, 21-15 ఆధిక్యంతో ఓడించిన సింధు రెండో రౌండ్లో తాయ్పై నెగ్గడం ద్వారా నాకౌట్ అవకాశాలను మెరుగుపరచుకుంది. గ్రూప్ ‘ఏ’లో జరిగే చివరి మ్యాచ్లో ఆమె జాన్ బైవెన్ను ఢీ కొంటుంది. అంతకు ముందు మొదటి రౌండ్ మ్యాచ్లో బైవెన్ 15-21, 17-21 తేడాతో తేడాతో తాయ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు తాయ్ని ఓడించిన ఉత్సాహంతో సింధు సులభంగానే బైవెన్పై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇలావుంటే, పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ నాకౌట్ చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకున్నాడు. తొలి రౌండ్లో కెన్టో మొమొటోను ఢీకొని, 18-21, 6-21 తేడాతో చిత్తయిన సమీర్ గురువారం జరిగిన రెండో మ్యాచ్లో టామీ సుగియార్తోపై 21-16, 21-7 ఆధిక్యంతో విజయభేరి మోగించాడు. దీనితో చివరి మ్యాచ్ అతనికి అత్యంత కీలకంగా మారింది. ఆ మ్యాచ్లో కన్ట్ఫాన్ వాంగ్ చెరెయన్తో వర్మ తలపడతాడు.
చిత్రం..పీవీ సింధు