క్రీడాభూమి

ఇరగదీశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 4: ఓవైపు చతేశ్వర్ పుజారా.. మరోవైపు రిషబ్ పంత్.. ఇంకోవైపు రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బౌలర్లను ఆటాడుకున్నారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. ఓవర్ నైట్ స్కోరు నాలుగు వికెట్లకు 303తో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే హనుమ విహారి (42) వికెట్ కోల్పోయంది. 101వ ఓవర్‌లో నాథన్ లియాన్ వేసిన చివరి బంతికి లాబుస్చాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విహారి వెనుదిరిగాడు. భారత్ రివ్యూ కోరినా రిప్లైలో అవుట్ అని తేలడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, పుజారాతో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ క్రమంలో పుజారా ఫోర్ కొట్టి 150 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు సవాల్ విసిరారు. ఓవైపు పరుగులు రాబడుతూనే అచితూచి ఆడారు. 129.5 ఓవర్‌లో లియాన్ అద్భుతమైన బంతికి పుజారా అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఉన్నాడు. 22 ఫోర్లతో 373 బంతుల్లో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 141 బంతుల్లో రెండో టెస్టు సెంచరీ చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా దూకుడుగా ఆడి 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడో సారి బంతి మార్చినా వీరిని ఆపడం ఆస్ట్రేలియా బౌలర్లకు సాధ్యపడలేదు. 166.3 ఓవర్‌లో రిషబ్ పంత్ 150 పరుగుల మైలురాయని దాటాడు. చివరికి రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోరు 81 వద్ద లియాన్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా బౌల్డ్ అయ్యాడు. సమయం దగ్గరపడుతుండడంతో కెప్టెన్ కోహ్లీ డిక్లేర్డ్ చేశాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా గడ్డపై రెండో భారీ స్కోరు..

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ రెండో భారీ స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ సెంచరీలకు తోడు మయాంక్ అగ ర్వాల్, రవీంద్ర జడేజా అర్ధ సంచరీలు తోడవడంతో 622/7 భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి ముందు 2004లో సిడ్నీ మైదనంలోనే 705/7తో భారీ స్కోరు సాధించింది.
పుజారా అత్యధిక పరుగుల రికార్డు..
ఆస్ట్రేలియాలో ఆసియా ఉపఖండం జట్లలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డులో చతేశ్వర్ పుజారా (193) చోటు సంపాదించుకున్నాడు. పుజారాకు ముందు సచిన్ తెండూల్కర్ (241 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (233), రవిశాస్ర్తీ (206), అజార్ అలీ (పాక్, 205), వీరేంద్ర సెహ్వాగ్ (195) ఉన్నారు.
రిషబ్ ఖాతాలో రికార్డులు..
భారత వికెట్ కీపర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. విదేశీ గడ్డపై భారీ స్కోరు సాధించిన ఏసియాన్ వికెట్ కీపర్లలో రిషబ్ బంగ్లా కీపర్ ముఫ్తికర్ రహీంతో పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రహీం 2017 వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనతను సాధించాడు. మరోవైపు భారత్-ఆస్ట్రేలియా జట్లలో అతి పిన్న వయసులోనే (21ఏళ్ల 92 రోజులు) సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో (18ఏళ్ల 256 రోజులు) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ ముందువరుసలో నిలిచాడు. 1992 సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ (148 నాటౌట్) ఈ ఘనతను అందుకున్నాడు.
లియాన్ 15సార్లు!
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు రికార్డులకు వేదికైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో రోజూ మంచి ఫాంలో ఉన్న చతేశ్వర్ పుజారా (193)ను తన బౌలింగ్‌లో తానే క్యాచ్ అందుకొని రికార్డు సృష్టించాడు. ఒక బ్యాట్స్‌మన్‌ను ఇలా అవుట్ చేయడం లియాన్‌కు 15వ సారి. ఓవరాల్ ఈ జాబితాలో శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 35 సార్లు, ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ 21 సార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, లియాన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

స్కోర్‌బోర్డు..

భారత్ తొలి ఇన్నింగ్స్:

మాయాంక్ అగర్వాల్ (సీ) మిచెల్ స్టార్క్ (బీ) నాథన్ లియాన్ 77; లోకేష్ రాహుల్ (సీ) షాన్ మార్ష్ (బీ) జొస్ హాజెల్‌వుడ్ 9; చతేశ్వర్ పుజారా (సీ), (బీ) నాథన్ లియాన్ 193; విరాట్ కోహ్లీ (సీ) టిమ్ పైన్ (బీ) జొస్ హాజెల్‌వుడ్ 23; అజింక్య రహానే (సీ) టిమ్ పైన్ (బి) మిచెల్ స్టార్క్ 18; హనుమ విహారి (సీ) లాబుస్చాన్ (బీ) నాథన్ లియాన్ 42; రిషబ్ పంత్ 159 (బ్యాటింగ్); రవీంద్ర జడేజా (బీ) నాథన్ లియాన్ 81.

ఎక్‌స్ట్రాలు: 20, మొత్తం (167.2 ఓవర్లలో 7 వికెట్లకు) 622.

వికెట్ల పతనం: 1-10, 2-126, 3-180, 4-228, 5-329, 6-418, 7-622

బౌలింగ్: మిచెల్ స్టార్క్ 26-0-123-1, జొస్ హాజెల్‌వుడ్ 35-11-105-2, పాట్ కమిన్స్ 28-5-101-0, నాథన్ లియాన్ 57.2-8-178-4, మామస్ లాబుస్చాన్ 16-0-76-0.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ 19 (బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా 5 (బ్యాటింగ్)

ఎక్‌స్ట్రాలు: 0; మొత్తం: (10 ఓవర్లలో) 24.

బౌలింగ్ : మహమ్మద్ షమీ 3-0-9-0, జస్ప్రీత్ బూమ్రా 3-0-12-0, రవీంద్ర జడేజా 2-1-1-0, కుల్దీప్ యాదవ్ 2-1-2-0.