క్రీడాభూమి

భారత స్టార్ల శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా మహిళల సింగిల్స్‌లో హాంకాంగ్‌కు చెందిన జాయ్ జువాన్ డెంగ్‌ను 14-21, 21-18, 21-18 తేడాతో ఓడించింది. రెండో రౌండ్‌లో ఆమె హాంకాంగ్ క్రీడాకారిణి పయ్ ఇన్ ఇప్‌ను ఢీ కొంటుంది. కఠినమైన డ్రాను ఎదుర్కొంటున్న కశ్యప్ తన తొలి రౌండ్‌లో 19-21, 21-19, 21-10 తేడాతో డె న్మార్క్ ఆటగాడు రస్ముస్ జెమ్కేను ఓడించాడు. కిడాంబి శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లోనే హాంకాంగ్ ఆటగాడు ఆగ్నస్ కా లింగ్‌ను 21-17, 21-11 తేడాతో చిత్తుచేసి రెండో రౌండ్ చేరాడు. కాగా, మిక్క్‌డ్ డబుల్స్‌లో భారత్ పో రాటానికి తెరపడింది. ప్రణవ్ జెర్రీ చోప్రా, సి క్కీ రెడ్డి జోడీ 19-21, 17-21 తేడాతో ఇండోనేసియాకు చెందిన ని కెటుట్ మహాదేవి ఇష్టారా ణి, రిజ్కీ అమెలియా ప్రదీప్తా జోడీ చేతిలో మొ దటి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంది.