క్రీడాభూమి

ప్రపంచకప్‌కి అతడు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఇటీవల ఆడిన మ్యాచుల్లో వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ కు సెలక్టర్లు ఎంపిక చేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ప్రపంచకప్‌కు వెళ్లే జట్టులో అనుభవమే ప్రాతిపదికన తీసుకోవా లని, పంత్ స్థానంలో రెగ్యూలర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి బ్యాకప్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని కోరాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్‌కు తన కలల జట్టును లక్ష్మ ణ్ ఎంపిక చేశాడు. ఇందులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు స్థానం కల్పించకపోగా, దినేష్ కార్తీక్‌ను జట్టులో చేర్చాడు.
లక్ష్మణ్ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, ఖలీల్ అహమ్మద్.