క్రీడాభూమి
సైనిక సంక్షేమానికి బీసీసీఐ రూ.20 కోట్లు వితరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 March 2019
న్యూఢిల్లీ: సైనిక సంక్షేమ నిధికి బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) రూ.20 కోట్ల విరా ళం ప్రకటించింది. ఈ విరాళాన్ని మార్చి 23న ఐపీఎల్ తొలి మ్యాచ్కు ముందు అందిం చనుంది. విరాళాన్ని స్వీకరించేందుకు త్రివిధ దళాల్లోని అత్యు న్నత అధికారులను ఆహ్వానిం చనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్ర మంలో చెన్నై సారథి మహేంద్రసింగ్ ధో నీ, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొననున్నారు. యేటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు బీసీసీఐ భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంది. పు ల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసా రి వేడుకలను రద్దు చేసి అందుకు కేటాయంచిన మొత్తాన్ని విరాళంగా అందించాలని నిర్ణయంచిం ది. పుల్వా మా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.