క్రీడాభూమి
ఐపీఎల్ విజేత ముంబయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 May 2019
హైదరాబాద్ : ముంబయి ఇండియన్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నాలుగోసారి నిలిచింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదానంలో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబయి జట్టు 7 వికెట్లు కోల్పోయ 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబయి జట్టునే విజయం వరించింది. గతంలో ముంబయి జట్టు గెలిచిన మూడుసార్లు మొదటగా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకొని టోర్నీ సాధించగా, ఈసారీ అలాగే జరగడం విశేషం.
చిత్రం...ట్రోఫీతో ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ