క్రీడాభూమి
ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో సింధు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 July 2019
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్లో చైనా షట్లర్ చెన్యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుగా ఓడించి తొలిసారి ఫైనల్కి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో చెన్యుఫీ 4-7 ఆధిక్యం సాధించగా, సింధు వెంటవెంటనే పాయింట్లు సాధించి సమం చేసింది. ఆ తర్వాత రెండో గేమ్లో ప్రత్యర్థి ఏమాత్రం అవకాశం ఇవ్వని సింధు 21-19, మూడో గేమ్లో 21-10 పాయింట్లను సాధించి విజయం అందుకుంది. జపాన్ క్రీడాకారిణి, చిరకాల ప్రత్యర్థి యమ గూచితో ఆదివా రం సింధు ఫైనల్లో తలపడనుంది.
చిత్రం...విజయం సాధించిన అనంతరం భారత షట్లర్ పీవీ సింధు