క్రీడాభూమి

కివీస్‌కు 177 పరుగుల ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలె, ఆగస్టు 16: శ్రీలంకతో జరు గుతున్న మొదటి టెస్టులో న్యూజి లాండ్ 177 పరుగుల ముందంజలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 227 పరుగులతో మూడో రోజు శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆతిథ్య శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో మరో 40 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టుపై 18 పరుగుల ఆధిక్యాన్ని సంపాందించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారం భించిన న్యూజిలాండ్ జట్టు ఆట ము గిసే సమయానికి 7వికెట్లను కోల్పోయ 195 పరుగులు చేసి, 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బ్యాట్స్‌మెన్ల లో ఓపెనర్ టామ్ లాథమ్ (45), బీజే వాట్లింగ్ (63, నాటౌట్) మాత్రమే రాణించారు.
క్రీజులో వాట్లింగ్‌తో పాటు విలియమ్ సోమర్‌విల్లే (5 నాటౌట్) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా 4 వికెట్లు తీయగా, ధనుంజయ డిసిల్వా 2, అఖిల ధనుంజయ 1 వికెట్ తీశారు.