క్రీడాభూమి

సోనియా లాథర్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్తానా (కజకిస్థాన్), మే 27: ఎఐబిఎ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ సోనియా లాథర్ రజత పతకాన్ని గెలుచుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన 57 కిలోల ఫైనల్ బౌట్‌లో ఆమె ఇటలీకి చెందిన టాప్ సీడ్ బాక్సర్ అలెస్సియా మెసియానో చేతిలో పరాజయం పాలవడంతో రజత పతకంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ రౌండ్స్‌కు చేరుకున్న భారత బాక్సర్ లాథర్ ఒక్కరే. అయితే ఫైనల్ బౌట్‌లో లాథర్ ఓటమిపాలైనప్పటికీ రజత పతకాన్ని గెలుచుకోవడంతో ఈ పోటీల నుంచి భారత బృదం వట్టి చేతులతో తిరిగి రావలసిన అగత్యం నుంచి బయటపడింది. హర్యానాకు చెందిన 24 ఏళ్ల లాథర్ ఫైనల్ బౌట్ తొలి రౌండ్‌లో పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరి ప్రత్యర్థిని గడగడలాడించింది. అయితే ఆ తర్వాత తేరుకుని విజృంభించిన మెసియానో 2-1 తేడాతో లాథర్ ఓడించింది.