క్రీడాభూమి

మాస్కులతోనే ప్రాక్టీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరీ దారుణంగా పెరిగిన విషయం తెలిసిందే. అయతే ఈ సెగ ప్రజలతో పాటు క్రికెటర్లకు తాకింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు మొదటి మ్యాచ్ కోసం బుధవా రం ఢిల్లీలో దిగారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు మరో రెండు రోజులే సమయం ఉండడంతో గురువారం క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్‌కు దిగారు. వాయు కాలుష్యం దెబ్బకు తప్పని సరి పరిస్థితుల్లో మాస్క్‌లను ధరించి ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వేదికను బీసీసీఐ చివరి దశలో మార్చాలని చూసినా సాధ్యపడలేదు. దీంతో ఢిల్లీలోనే తొలి టీ20 జరగనుంది.
*చిత్రం... ముఖానికి మాస్క్‌ను ధరించి ప్రాక్టీస్ చేస్తున్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ లిటన్‌దాస్