క్రీడాభూమి

గొంతు నొప్పిగా ఉంది: బంగ్లా కోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా మారడంతో క్రికెటర్లు ఇబ్బందులు పడుతు న్నారు. అయతే బంగ్లా కోచ్ రస్సెల్ డొమింగో మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ గొంతు నొప్పిగా ఉందని, ఎవరూ చనిపోయేంత ప్రమాదకర పరిస్థితులు లేవని పేర్కొ న్నాడు. టీ20కిముందు దేశ రాజధాని ఢిల్లీలో ని పరిస్థితులు సరైనవి కావని అంగీకరించాడు. అయతే ఇరు జట్లకు ఇది ఒకటేనని, వారు దీనిని ఎదుర్కో వాల్సిందేనన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగం గా భారత్-బంగ్లా మధ్య ఆదివారం మొదటి టీ20 జరగనుంది. గాలి నాణ్యత ప్రమాదకార స్థాయకి పడిపోవడంతో శుక్రవారం ఢిల్లీలో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌పై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.