క్రీడాభూమి

బీసీసీఐ పాలక మండలిలో అల్కాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత క్రికెట్ నియంత్రణ బోర్టు (బీసీసీఐ) పాలక మండలిలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసు అల్కా రెహానీ భరద్వాజ్‌కు చోటు లభించింది. ఆమె బీసీసీఐకు కంప్ట్రొలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రతినిధిగా వ్యవహారిస్తారు. 1993 బ్యాచ్‌కు చెందిన అల్కా ప్రస్తుతం ముంబయిలోని డైరెక్టర్ ఆఫ్ రీజనల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్‌లో సేవలందిస్తున్నారు. ఆమె ‘కాగ్’గా వ్యవహారిస్తుందని ప్రిన్సిపల్ డైరెక్టర్ విక్రమ్ మురుగరాజ్ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ‘కాగ్’ ప్రతినిధిగా ఆమె బీసీసీఐ పాలనా వ్యవహారాలను పరిశీలిస్తారు.