క్రీడాభూమి

సుశీల్‌కు చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాదాపుగా కోల్పోయాడు. నర్సింగ్ పంచమ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కి ఉంది. అయితే, ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌కు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో సుశీల్‌కు చోటు కల్పించని డబ్ల్యుఎఫ్‌ఐ నర్సింగ్ పేరు పరోక్షంగా ఖరారు చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత అంతర్జాతీయ టోర్నీలకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ అతను పలు పోటీలకు గైర్హాజరయ్యాడు. కాగా, నర్సింగ్ 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నిరుడు దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో, లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలను అందుకున్నాడు. అతని కృషి ఫలితంగానే రియో ఒలింపిక్స్‌లో పురుషుల 74 కిలోల విభాగంలో ఒక రెజ్లర్‌ను పంపే అవకాశం డబ్ల్యుఎఫ్‌ఐకి లభించింది. ఈనేపథ్యంలోనే, మంచి ఫామ్‌లో ఉన్న నర్సింగ్‌ను రియోకు పంపాలన్న డిమాండ్ జోరందుకుంది. డబ్ల్యుఎఫ్‌ఐ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయంతో ఉంది. కాగా, రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని, ఇండివిజువల్ ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించిన తనకే అవకాశం దక్కాలన్నది సుశీల్ వాదన. నర్సింగ్‌తో ట్రయల్ బౌట్‌ను నిర్వహించి, గెలిచిన వారిని రియో పంపాలని అతని డిమాండ్. అయితే, అతని ప్రతిపాదనపై డబ్ల్యుఎఫ్‌ఐ అతని ప్రతిపాదనపై స్పందించలేదు. ఒలింపిక్స్‌లో ఎవరు పోటీపడాలన్నది ఇంకా ఖరారు కాలేదని అంటూనే, మరోవైపు సుశీల్‌కు శిక్షణ శిబిరంలో అవకాశం కల్పించకుండా తన ఆంతర్యాన్ని వెల్లడించింది. ఇలావుంటే, ట్రయల్ బౌట్‌ను నిర్వహించే విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులకు సుశీల్ లేఖలు రాశాడు. కానీ, సానుకూల స్పందన రాలేదు. అన్ని రకాల ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే వారిని ఎంపిక చేసేందుకు ట్రయల్స్‌ను నిర్వహిస్తారని, అదే సూత్రాన్ని రెజ్లింగ్‌కు కూడా వర్తింప చేయాలని అతను కోరాడు. కాగా, ప్రపంచ చాంపియషిప్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించడం ద్వారా నర్సింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడని, ప్రత్యేకంగా ట్రయల్ బౌట్‌ను జరపాల్సిన అవసరం లేదని డబ్ల్యుఎఫ్‌ఐ స్పష్టం చేసింది. ట్రయల్స్ అనేది ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లండన్ ఒలింపిక్స్ అనంతరం అంతర్జాతీయ రెజ్లింగ్ నుంచి దాదాపుగా కనుమరుగైన సుశీల్ హఠాత్తుగా తెరపైకి వచ్చి, రియో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశాన్ని కల్పించాలని కోరడం విచిత్రంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ హై కోర్టు కూడా దాదాపు అదే విధంగా స్పందించడం విశేషం. సుళీల్ సామర్థ్యాన్ని, అతను దేశానికి అందించిన సేవలను విస్మరించకూడదని వ్యాఖ్యానించిన కోర్టు ట్రయల్ బౌట్ కోసం డబ్ల్యుఎఫ్‌ఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తూ సుశీల్ పిటిషన్‌ను కొట్టేసింది.