క్రీడాభూమి
మొదటి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 January 2020
గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలుకానుండగా, 6:30 గంటలకు టాస్ వేశారు. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయతే మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుందనగా అరగంట పాటు వర్షం బీభత్సం సృష్టించింది. పిచ్ పూర్తిగా తడవడంతో అంపైర్లు మూడుసార్లు పరిశీలించి మ్యాచ్ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.