క్రీడాభూమి

తమిళనాడు-ముంబయి మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 14: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న తమిళ నాడు, ముంబయి మ్యాచ్ చివరి రోజు డ్రాగా ముగిసింది. ముందుగా టాస్ గెలిచన ముంబయి జట్టు తన మొద టి ఇన్నింగ్స్‌లో 488 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్, వికెట్ కీపర్ ఆదిత్యథారె (154), శామ్స్ ములానీ (87), శశాంక్ (58) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తన మొదటి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌటైంది.
రవిచంద్రన్ అశ్విన్ (79), కౌషిక్ గాంధీ (60), అభినవ్ ముకుంద్ (58) రాణించారు. ఆ తర్వాత వెంటనే మళ్లీ తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌కు దిగగా 1 వికెట్ నష్టపోయి 48 పరుగులు చేసింది. అప్పటికే చివరి రోజు ఆట సమయం ముగియడంతో మ్యాచ్‌ను అంపైర్లు డ్రా చేస్తున్నట్లు ప్రకటించారు.