క్రీడాభూమి

హరారేలో టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 9: జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సంక్షిప్త సిరీస్‌లో పాల్గొనేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం ఇక్కడికి చేరింది. జింబాబ్వేతో టీమిండియా మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈనెల 11, 13, 15 తేదీల్లో వనే్డ ఫార్మెట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. టి-20 విభాగంలో ఈనెల 18, 20, 22 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయి. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అశ్విన్‌లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో టీమిండియాలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.