క్రీడాభూమి
విజయాల పరంపరను కొనసాగించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 3 February 2020
ముంబయి, ఫిబ్రవరి 3: న్యూజీలాండ్ గడ్డపై భారత్ సాధించిన టీ 20 సిరీస్ 5-0 విజయం ఒక ‘గొప్ప లక్ష్య సాధన’గా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అభివర్ణించాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ భారత జట్టు అదే ఊపును కొనసాగించాలని సూచించాడు. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు న్యూజీలాండ్ను ‘వైట్వాష్’ చేసిందని జహీర్ కొనియాడాడు. ప్రత్యేకించి రెండు సూపర్ ఓవర్లలో అద్భుత ఆటతీరును జట్టు ప్రదర్శించిందన్నాడు. గతంలో ఆయన జట్టుపై చేసిన వ్యాఖ్యలను విలేఖరులు గుర్తు చేయగా పరిస్థితులన్నీ మెరుగవుతాయని తాను భావిస్తున్నానని, ప్రస్తుతానికి న్యూజీలాండ్ జట్టు కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని బదులిచ్చాడు.