క్రీడాభూమి
నేటి నుంచి రావల్పిండి వేదికగా టెస్టు సిరీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 7 February 2020
పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నేటి నుంచి రావల్పిండి వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ప్రాక్టీస్ కోసం పిండి స్టేడియానికి తరలించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ భద్రత చర్యలను చేపట్టింది. పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ ఇంకా రెండు టెస్టులతో పాటు, ఏకైక వనే్డ ఆడనుంది. తొలి టెస్టు నేటి నుంచి ప్రారంభం కానుండగా, మధ్యలో నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 3న వనే్డ జరగనుంది. ఇక రెండో, చివరి టెస్టు ఏప్రిల్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఇరు జట్ల మధ్య గత నెల జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ 2-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది.