క్రీడాభూమి
రియో బెర్తులకు చేరువైన మనోజ్, సుమిత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాకు (అజర్బైజాన్), జూన్ 21: అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో కామనె్వల్త్ క్రీడల పసిడి పతక విజేత మనోజ్ కుమార్తో పాటు భారత్కు చెందిన మరో బాక్సర్ సుమిత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. దీంతో వీరు ఆగస్టులో బ్రెజిల్లోని రియో డీ జెనిరోలో జరిగే ఒపింపిక్ క్రీడలకు అర్హత సాధించేందుకు మరో అడుగు దూరంలో నిలిచారు. ఎఐబిఎ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఇక్కడ 64 కిలోల విభాగంలో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ బౌట్లో మనోజ్ కుమార్ 2-1 తేడాతో బల్గేరియాకు చెందిన ఐరిన్ స్మెతోవ్పై విజయం సాధించగా, 81 కిలోల విభాగంలో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ బౌట్లో సుమిత్ సంగ్వాన్ 3-0 తేడాతో మంగోలియా బాక్సర్ సందగ్సురెన్ ఎర్డెనెబాయర్ను మట్టికరిపించాడు.