రాష్ట్రీయం

శ్రీకాళహస్తీశ్వరునికి సింహవాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెండి సింహ వాహనం విరాళంగా అందజేసింది. అపోలో అధినేత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పలుమార్లు ఆలయానికి వచ్చిన సందర్భంగా దేవస్థానం వారు వెండి వాహనాల తయారీపై చర్చించారు. రెండేళ్ల క్రితం వెండి నంది వాహనాన్ని విరాళంగా అందజేశారు. శనివారం 100 కిలోల వెండితో తయారుచేసిన 60 లక్షల విలువైన సింహ వాహనాన్ని ఆలయానికి అందజేశారు. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కుమార్తె ప్రీతమ్‌రెడ్డి వెండి వాహనాన్ని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, ఇఓ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. వెండి వాహనాన్ని విరాళంగా అందజేసినందుకు ప్రీతమ్‌రెడ్డికి దేవస్థానం వారు ధన్యవాదాలు తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అపోలో ఆస్పత్రి యాజమాన్యం అందజేసిన సింహ వాహనం