క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, అక్టోబర్ 6 : కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. పోలీసుల కధనం మేరకు బుచ్చిరెడ్డిపాళెం నుంచి నెల్లూరు వైపు అధిక వేగంతో మోటారు బైక్‌పై ప్రయాణిస్తూ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారుగా పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల జువైనల్ హోం నుంచి విడుదల కాగా మరొకరు జైలు నుంచి పారిపోయిన ఖైదీగా అనుమానిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీరి ఫొటోలను తమిళనాడు పోలీసులకు అందజేశారు. స్థానికుల సహకారంతో కోవూరు పోలీసులు ఇద్దరి మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న బైకును, లారీను కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేసి ఎస్‌ఐ అళహరి వెంకట్రావ్ దర్యాప్తు చేస్తున్నారు.