క్రైమ్/లీగల్

కొడుకును కడతేర్చిన తండ్రి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు రూరల్, నవంబర్ 20: భార్యపై అనుమానంతో కన్నకొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ రామాంజనేయరెడ్డి విలేఖరుల సమావేశంలో ఈ సంఘటన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యిక్తి భార్యపై అనుమానంతో తరచూ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈక్రమంలో 4 సంవత్సరాల క్రితం భార్య భార్తల మధ్య మనస్పర్థలు ఎక్కువ అవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సరేష్ భార్య మాధవి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. అనంతరం తన మూడవ సంతానంతో కలిసి రాజోలు గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తుండేవాడని చెప్పారు. అతను ఎప్పటినుంచో అనుమానం ఉన్న మూడవ కుమారుడైన శ్రీ్ధర్ తనకు పుట్టలేదని లోలోన మధన పడుతుండేవాడన్నారు. ఆ అనుమానం ఎక్కువై నాలుగేళ్ల క్రితం ఓరోజు కట్టెల కోసమని తన చిన్నకుమారుడు శ్రీ్ధర్ (4)ను అడవికి తీసుకెళ్లాడు. తిరిగి గ్రామినికి వచ్చిన సురేష్ తన కొడుకుకు ఫిట్స్ వచ్చాయని ఒక్కసారి కిందపడి చనిపోయాడని బంధువులు, గ్రామస్తులకు చెప్పి నమ్మించాడన్నారు. సరేష్ చెప్పిన విషయాన్ని అనుమానించిన అతని బంధువు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. వచ్చిన ఫిర్యాదుపై శ్రీ్ధర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం ద్వారా శ్రీ్ధర్ మృతి చెందినట్లు తేలడంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. పోలీసుల విచారణలో తండ్రి సురేషే తన కుమారుడు శ్రీ్ధర్‌ను హత్య చేసినట్లు తేలిందన్నారు. అతనిని కోర్డుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీఐ అల్త్ఫా హుసేన్, ఏఎస్‌పేట ఎస్‌ఐ వీరనారాయణ పాల్గొన్నారు.