జాతీయ వార్తలు
మాల్యా ఆర్థిక ఉగ్రవాది: శివసేన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 March 2016
ముంబయి: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బకాయిపడి లండన్ వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో ఎన్డిఎ సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్లు శివసేన ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’లో మోదీ ప్రభుత్వం తీరును తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నపుడు ఎన్డిఎ నేతలు విజయ్ మాల్యాపై దుమ్మెత్తి పోశారని, ఇపుడు తాము అధికారంలో ఉండగా ఆయన దేశం విడిచిపోయేలా సహకరించారని శివసేన ధ్వజమెత్తింది. తెల్లకోటు వేసుకున్న ఆర్థిక ఉగ్రవాది మాల్యా అని ఆ పార్టీ అభివర్ణించింది.