రాష్ట్రీయం

మరో రెండు రోజులు మండే ఎండలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 18: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరో రెండు రోజులు తప్పవు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కన్పిస్తుండగా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు పట్టణాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోగా, కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం కోస్తాజిల్లాల్లో తుని, గన్నవరం పట్టణాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ వరుసగా నాలుగు, మూడు డిగ్రీల అధికం. ఇక అనంతపురం, కర్నూలు పట్టణాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తిరుపతిలో 41 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక్కడ సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికం. కాకినాడ, విశాఖపట్నంలో 38 డిగ్రీలు కాగా రెండు డిగ్రీలు అధికం. కావలి, ఒంగోలు, మచిలీపట్నంలో 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, సాధారణం కంటే ఒక డిగ్రీ అధికం. ఈ పరిస్థితులు మరో రెండు రోజులు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో హైప్రెజర్ జోన్ కారణంగా తేమ శాతం తగ్గిపోయిన పరిస్థితుల్లో పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు.