రాష్ట్రీయం

దేవుళ్లకే దిక్కులేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే దక్కిందంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు ఆలయాలకు, దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. 143వ రోజు ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా సోమవారం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బ్రహ్మలింగయ్య చెరువును వైఎస్ జగన్ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వైఎస్ జగన్‌కు స్థానికులు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కిందిస్థాయి నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయంటూ విమర్శలు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ నేతలు దుర్మార్గంగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తుందని అందులో
ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి చెరువు పరిస్థితి ఇలానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మట్టితో కూడా వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఆయన ప్రస్తుతం అదే పని చేసి చూపిస్తున్నారన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతుంటే ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుందన్నారు. చివరికి దేవుళ్లను కూడా గుళ్లలో ఉండనీయడం లేదన్నారు. రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారని అన్నారు. తాను వస్తున్నానని తెలిసి ఈ రోజు తాత్కాలికంగా పనిని ఆపేశారన్నారు. రోజూ వందల లారీలతో ఇసుక, మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎండగట్టారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్