రాష్ట్రీయం

తిరుమలలో పర్యావరణం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారని, అయినా ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణం చక్కగా, ఆహ్లాదంగా ఉందని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ కమిటీ గురువారం సాయంత్రం తిరుమలలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తిరుమలలో పారిశుద్ధ్యం నిర్వహణ బాగుందని, చక్కటి పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నారని కొనియాడారు. శ్రీవారి భక్తులకు ఒక సంవత్సరానికి 96కోట్ల రూపాయలతో అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. సామాన్యభక్తులుండే వసతీ గదులను పరిశీలించామని, సౌకర్యాలు బాగున్నాయన్నారు. అంతకుముందు తిరుమలలోని బూందీపోటు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అక్షయ వంటశాల, పి ఏ సీ2లోని కల్యాణకట్ట, కాకులకొండలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, కాకులకోన తిప్ప, శ్రీగంధం మొక్కల పెంపకాన్ని కమిటీ పరిశీలించింది. ఈ పరిశీలన కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, చీప్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సీ వి ఎస్ ఓ శివకుమార్‌రెడ్డి, ఎస్ ఈ 2 రామచంద్రారెడ్డి, వీ ఎస్ వో రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.