తెలంగాణ

రాహుల్‌పై తిరగబడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ సమగ్రతను కోరుకునే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తిరుగుబాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ సోమవారం ఇందిరా పార్కు వద్ద బిజెపి ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై, రాహుల్‌పై మండిపడ్డారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తున్న వారికి మద్దతు ఇస్తున్న రాహుల్‌కు తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే హక్కు లేదన్నారు. హైదరాబాద్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుహనా లౌకికవాదులు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలను పణంగా పెడతామని, తమకు అధికారం ముఖ్యం కాదని అన్నారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ గిలగిల కొట్టుకుంటోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తుందన్నారు. ఈ నిరసన సభలో బిజెపి శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.