రాష్ట్రీయం

ఎపిని లూటీ చేస్తున్న బాబు సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను లూటీ చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దేశ వ్యాప్తంగా వృద్ధి రేటు 7 శాతం ఉంటే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు ఎలా సాధిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఏవిధంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారని, అందుకు ఉన్న అంచనాలు ఏమిటని రోజా ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి రంగం అడుగంటిందని అన్నారు. గతంలో చంద్రబాబు పాలన హయాంలోనే వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌ను దాట లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో నేరస్తులు పెరిగిపోయారని, మహిళలపై అరాచకాలు యధేచ్ఛగా సాగుతున్నాయని అన్నారు. జీతాలు పెంచాలని అంగన్‌వాడీలు అడుగుతుంటే వారిని లాఠీలతో కొడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం నేతలు సైకోలుగా మారి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.