రాష్ట్రీయం

ఆందోళనలో కొత్తపర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం/వీరవాసరం, జూన్ 21: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోదావరి ‘మెగా ఆక్వా ఫుడ్ పార్కు’ వ్యతిరేక ఆందోళన కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు పార్కు పనులు అడ్డుకోవడం, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు తదితర ఆందోళనలు చేపట్టిన పరిసర గ్రామాల ప్రజలు తాజాగా మరో కొత్త తరహా ఆందోళనకు తెరలేపారు. ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు, వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఒక మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. దీంతో రెండు గ్రామాల్లో ఉద్రిక్త, ఉత్కంఠ వాతావరణ నెలకొంది. పచ్చని పొలాలు, జనావాసాల మధ్య నుండి తుందుర్రు ఆక్వాపార్కును తరలించాలని గత మూడేళ్లుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫుడ్ పార్కు పరిశ్రమ పైప్‌లైను పనులు చేపట్టారు. దీంతో నిరసనకారులు ఆందోళనను ఉద్ధృతంచేశారు. జొన్నలగరువు గ్రామానికి చెందిన కొయ్యే సంపదరావు, కొయ్యే పెదపౌలు గురువారం ఉదయం కొప్పర్రు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి ఉదయం నుంచి రాత్రి వరకు టవర్‌పైనే ఉండిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు మత్స్యపురి గ్రామంలో ఆరేటి సత్యవతి అనే మహిళ సెల్ టవర్ ఎక్కింది. ఉదయం టవర్ ఎక్కిన ఆమె రాత్రి 10 గంటల సమయంలోనూ టవర్‌పైనే ఉండిపోయింది. దీనితో ఆమెకు మద్దతుగా రాత్రి గ్రామస్థులు రాస్తారోకో ప్రారంభించారు. ఫుడ్‌పార్కు వ్యతిరేక ఉద్యమకారుల నిరసనలతో అప్రమత్తమైన పోలీసులు ఫుడ్ పార్కు పరిసర గ్రామాల్లోని సెల్ టవర్లు, మంచినీటి ట్యాంకుల వద్ద భద్రతా ఏర్పాట్లుచేశారు.