రాష్ట్రీయం

నేడు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఉప రాష్టప్రతి శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉప రాష్టప్రతి అన్సారీ నేరుగా రైతు సంఘం అధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటయ్యే కిసాన్ మేళాలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన రాజ్‌భవన్ చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
మర్నాడు (ఆదివారం) ఉదయం ఆయన ఆఘాఖాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఖులీఖుతుబ్‌షా సమాధుల మరమ్మతుల పనులను పరిశీలించి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.