అలనాటి గాయని రాణి ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అలనాటి గాయని కె.రాణి (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో కల్యాణ్‌నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా..’ పాటతో రాణి ప్రసిద్ధిగాంచారు. తెలుగులో సుమారు 500కు పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు. ‘రూపవతి’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన రాణి.. ‘బాటసారి’, ‘జయసింహ’, ధర్మదేవత’, ‘లవకుశ’ వంటి చిత్రాల్లో తన పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. గాయని రాణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కె.రాణి (ఫైల్‌పొటో)