రాష్ట్రీయం

చంద్రబాబు చేసింది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి చేసింది ఏమీ లేదని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌కె రోజా విమర్శించారు. ఒక్క చేనేత కార్మికుడికీ రుణ మాఫీ జరగలేదని ఆమె ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసగించారని ఆమె మండిపడ్డారు. పైగా రాష్ట్రానికి ఉన్న అప్పును రెట్టింపు చేశారని అన్నారు. 90 శాతం హామీలు నెరవేర్చినట్లు టీడీపీ వెబ్‌సైట్, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అటువంటప్పుడు వెబ్‌సైట్ నుంచి ఎన్నికల ప్రణాళికను ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. కరవుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఆమె దుయ్యబట్టారు. కమిషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి చంద్రబాబు తీసుకున్నారని ఆమె విమర్శించారు. పోలవరాన్ని అడ్డంపెట్టుకుని దోచుకుంటున్నారని రోజా విమర్శించారు. బీజేపీతో వైకాపా కలుస్తుందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు.