తెలంగాణ

తగలబడ్డ వాహనాలు అధికారిని కాల్చి చంపిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం పెట్రేగిపోయారు. రాజ్‌నంద్‌గావ్ సారడా ఎనర్జీ సంస్థ ఏజీఎం శ్రీకుమార్ నాయర్‌ను కాల్చి చంపారు. సంస్థకు చెందిన 6 వాహనాలకు నిప్పు పెట్టారు. పల్లెమాడి ఎల్‌ఓఎస్ కమిటీకి చెందిన 15 నుంచి 20 మంది సాయుధ నక్సల్స్ సంస్థలోకి చొరబడి ముందుగా ఏజీఎంను కాల్చి చంపారు. అనంతరం కొందరు నక్సల్స్ కార్యాలయం సమీపంలో ఉన్న 6 లారీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో రాజ్‌నంద్‌గావ్ పోలీసులు అప్రమత్తమై సమీప అటవీప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ అప్పటికే నక్సల్స్ తప్పించుకు పారిపోయారు.