తెలంగాణ
నేడు ఆప్ బహిరంగ సభ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 August 2018
హైదరాబాద్, ఆగస్టు 15: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ నెల 16న (గురువారం) బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సభ నిర్వహించనున్నది. అయితే హిమాయత్నగర్లోని ఏవీ కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆప్ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు బి.రాముగౌడ్, నసీం బేగం, శ్రీదేవి తదితరులు పోలీసు అధికారులను లిఖితపూర్వకంగా కోరారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారు బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏవీ కళాశాలలో సభ నిర్వహించామని ఆప్ నేతలు చెప్పారు. ఈ సమావేశానికి ఆప్ తెలంగాణ ఇన్చార్జి ప్రియాంక కర్కర్, ప్రజా గాయకుడు గద్దర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వారు తెలిపారు.