రాష్ట్రీయం

రాహుల్ పర్యటన చూసి భయపడి మహిళా నిథులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: రాహుల్ పర్యటన చూసి ఆందోళన చెందిన ముఖ్యమంత్రి 24 గంటల్లో మహిళల కోసం రూ.930 కోట్లు విడుదల చేశారని పీసీసీ మహిళ అధ్యక్షురాలు నేరళ్ల శారద అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు భయపడుతున్నారని అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15న 114 సెక్షన్ విధించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు. మహిళలంటే కేసీఆర్ గౌరవం లేదని, రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోనికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనుకంజ వేసేది లేదని, నిర్భంద, నిరంకుశ పాలనపై మహిళల్లో చైతన్యం కలిగిస్తామని స్పష్టం చేశారు.
చదువుకున్న మూర్ఖుడు కేటీఆర్...
చదువుకున్న మూర్ఖుడు మంత్రి కేటీఆర్ నేరళ్ల శారద దుయ్యబట్టారు. అధికారంతో కళ్లు నెత్తికెక్కి, దొర అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా కేటీ ఆర్‌కు ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత లేదని అన్నారు.