రాష్ట్రీయం

శ్రీశైలానికి మరింత తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 20: శ్రీశైలం జలాశయానికి ఎగువ కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద మరింత తగ్గింది. దీంతో జలాశయంలో 200 టీఎంసీల నీరు నిల్వ చేసి మిగిలిన నీటిని వెలుపలికి పంపుతున్నారు. తుంగభద్ర, కృష్ణానదులు ఒకేసారి శాంతించడంతో వరద జలాల చేరిక గణనీయంగా తగ్గింది. నీటిమట్టం 882 అడుగులకు చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు పంపడానికి ఎత్తిన ఐదు గేట్లను దించలేదు. జలాశయానికి సోమవారం సాయంత్రం సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1,04,592 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 50,442 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,55,034 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 31,995 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, ఐదు ఒక్కోటి 10 అడుగుల మేర ఎత్తి 1,34,180 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, హంద్రీ-నీవా ఎత్తిపోతలకు 2,025, పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా సోమవారం 882.30 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 200.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

చిత్రం..శ్రీశైలంలో ఐదుగేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యం