క్రైమ్/లీగల్

అమ్మతనానికే అవమానం! కన్నకొడుకును కడతేర్చిన తల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 22: అమ్మతనానికి అవమానం మిగిల్చేలా విజయనగరంలో ఓ మహిళ తన కుమారుడిని కడతేర్చింది. పోలీసుల వివరాల మేరకు- ఎం.కొండలరావు, వెంకటపద్మావతి దంపతులు. గాయత్రినగర్‌లో ఉంటున్న వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరి భగవాన్ ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమార్తె ఉమాదేవి పదో తరగతి చదువుతోంది. భార్య పద్మావతితో విభేదాలు రావడంతో భర్త కొండలరావు ఆరేళ్ల కిందటే విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి కొడుకు, కూతురు తల్లివద్దే ఉంటున్నారు. కాగా, ఇటీవల తల్లి వ్యవహారశైలి నచ్చక కొడుకు హరి భగవాన్ తల్లిని మందలించాడు. వెంకటపద్మావతి ఇంటికి అదేకాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి తరచూ వస్తుండడంతో తల్లికొడుకుల మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తన సంబంధానికి అడ్డంకిగా ఉన్న కొడుకును వదిలించుకునేందుకు తల్లి నిర్ణయించుకుంది. కుమారుడికి ముందు రోజు రాత్రి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి భోజనం పెట్టింది. కుమారుడు గాఢనిద్రలోకి జారుకోవడంతో తర్వాత చున్నీతో ఉరివేసింది. ఆత్మహత్యగా నమ్మబలికింది. పోలీసులు ఆరా తీయగా గుట్టు రట్టయింది.