రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మంగళవారం నాటికి ఇది తీవ్ర వాయుగుండం మారి, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య కేంద్రీకృతమై ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తా, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గాలులు కూడా తీవ్రంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వలన 20వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.