రాష్ట్రీయం

పలకరింపుల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: జనం మెచ్చిన నేతను జనం ఎన్నుకుంటారు. భీమవరం ప్రాంతానికి చెందిన కేవీఎస్ కార్తీక్ అనే వ్యక్తిత్వ వికాస శిక్షకుడు జగన్‌ను కలిసి తాను రచించిన ‘యూ ఆర్ సెలెక్టెడ్’ పుస్తకాన్ని బహుకరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో పాదయాత్ర మంగళవారం ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో అభిమానులు జగన్‌తో పాదం కలిపారు. ఈ ప్రాంతానికి చెందిన పలువులు మహిళలు, వృద్ధులు, రైతు కూలీలు తమ సమస్యలు జగన్ దృష్టికి తెచ్చారు. సీతమ్మపాలెం ప్రాంతానికి చెందిన పలువురు వికలాంగులు తమకు పింఛన్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. అనంతరం యాత్ర నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, తర్లువాడ, బాకురుపాలెం క్రాస్ మీదుగా యాత్ర సాగింది. ఈ సందర్భంగా పలువురు యాదవులు జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.

చిత్రం..వ్యవసాయ కూలీని పలుకరిస్తున్న జగన్