రాష్ట్రీయం

కిడారి భార్యకు కలెక్టర్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ జిల్లా డుంబ్రిగుడ లివిటిపుట్టు వద్ద మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు భార్య పరమేశ్వరిని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్న సర్వేశ్వరరావు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు శనివారం బయలుదేరి అరకు వెళ్లారు. ఆయన భార్య పరమేశ్వరి నగరంలోనే ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆమె ఇంట్లోనే ఉంది. భర్త సర్వేశ్వర రావు మావోల చేతిలో మరణించాడన్న వార్త తెలుసుకున్న ఆమె షాక్‌కు గురైంది. ఎమ్మెల్యే భార్యతో తొలుత ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ తరలిస్తారని తొలుత భావించినప్పటికీ, స్థానికుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో సర్వేశ్వర రావు భార్య, ఇతర బంధువులను బందోబస్తు నడుమ అరుకుకు పంపించారు.

చిత్రం..ఎమ్మెల్యే సర్వేశ్వర రావు భార్య పరమేశ్వరిని పరామర్శిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్