రాష్ట్రీయం
స్వైన్ ఫ్లూతో ఒకరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 November 2018
చిత్తూరు, నవంబర్ 9: జిల్లా కేంద్రమైన చిత్తూరులో శుక్రవారం స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల ఈనగరంలో ఈ వ్యాధి సోకి ఒకరు మరణించగా తాజాగా అదే ప్రాంతంలో మరో వ్యక్తి మృతి చెందడం కలకలం రేకెత్తించింది. చిత్తూరు నగరంలోని రామనగర్ ప్రాంతానికి చెందిన సుమారు 55 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉండటంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జిల్లాలో ఇప్పటికి సుమారు 90 మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉండగా, అందులో ఇప్పటికి నలుగురు మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.