రాష్ట్రీయం

తెరాసను వణికిస్తున్న రైతు నేస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 12: గెలుపు ధీమాతో ప్రచారపర్వం కొనసాగిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ను రైతుల నేస్తంగా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న తుమ్మలపల్లి ఫృథ్వీరాజ్ వణుకు పుట్టించే విధంగా రైతుల సమీకరణలో నిమగ్నమయ్యాడు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, సదాశివపేట, కంది, సంగారెడ్డి మండలాల్లోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ నామినేషన్ దాఖలకు సిద్ధమవుతున్నాడు. రైతులతో పాటుగా విద్యార్థి నాయకులను, నిరుద్యోగులను, వ్యాపారులను, నిరాశపరులను మచ్చిక చేసుకోవడంలో ఫృథ్వీరాజ్ చాపకింద నీరులా వ్యవహరిస్తున్నాడు. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న మైనార్టీ నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి ప్రాపకంలో కూడా ఫృథ్వీ అనుచరులు తనవంతుగా కృషి చేస్తున్నారు. ఈనెల 15వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సుమారు రెండు వేల మంది రైతులతో అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేసి తమ సత్తా చాటాలనే దృఢసంకల్పంతో ఫృథ్వీరాజ్ వర్గీయులు వ్యూహరచనలు చేస్తున్నారు. ఒక్కో గ్రామం నుండి కనీసం 20 నుండి 40 మంది రైతులను సమకట్టుకుని నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తరలివెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.