రాష్ట్రీయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు 7 నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 12: శాసనసభ ఎన్నికల నామినేషన్ల తొలి రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 నామినేషన్లు మాత్రమే దాఖలు కావటం విశేషం. ఖమ్మం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎవిజె ప్రసాద్, వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాణోత్ మదన్‌లాల్, భద్రాచలం నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా మిడియం బాబూరావు, కొత్తగూడెం నియోజకవర్గంలో ఆమ్‌ఆద్మి పార్టీ అభ్యర్థిగా గుండపనేని సతీష్, స్వతంత్ర అభ్యర్థిగా ఈసంపల్లి వంశీకృష్ణ, ఆశ్వారావుపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సున్నం నాగమణి నామినేషన్లు దాఖలు చేశారు. వైరా, భద్రాచలంలో మదన్‌లాల్, సీపీఎం అభ్యర్థిగా పి.వీరభద్రం, మిడియం బాబురావు భారీ ప్రదర్శనగా వెళ్ళి నామినేషన్లు దాఖలు చేశారు.