రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు అధికారం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 14: వచ్చే రోజులు కాంగ్రెస్‌వి అని రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ కుటుంబం శని డిసెంబర్‌లో వదులుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ద్వజమెత్తారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్‌షోను నిర్వహించారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను వదలబోనని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబ సభ్యులు సాంపాదించిన అవినీతి సొమ్మును పైసాపైసా కక్కిస్తానని హెచ్చరించారు. తన గొంతను నొక్కడానికి తనపై క్షక్షగట్టారని ఇష్టం వచ్చిన్నట్లుగా కేసులు పెట్టి భయపెట్టించాలన్చిస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడరని అన్నారు. దళితులకు మూడెకరాలను భూమి పంచని కేసీఆర్ దళిత ద్రోహి అని ఓ ఒక్క దళిత బిడ్డ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయరాదని తమ జాతికే అవమానం చేసిన వారిని వదలకూడదని పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి దగా చేశారని ఇలాంటి దగాకోరు కేసీఆర్‌ను యువత వదలకూడదని ఈ ఎన్నికల్లో తమ ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యుల ఓట్లు గ్రామాల్లోని ఇతరుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడకుండా చూడాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దమయ్యారని అన్నారు. తనను ఓడించడానికి ఓ పట్నం ముఠాను దింపారని ఆ ముఠా ఇక్కడి ప్రజలను డబ్బుతో కొనుక్కోవాలని చూస్తున్నారని కేసీఆర్ కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. ఎంతో మంది పేదల ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేశారని పేదలందరికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఇస్తానని చెప్పి పారిపోయాడని విమర్శించారు. ఇళ్లులేని పేదలను మోసం చేసిన కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుండి ఫౌం హౌస్‌కు పంపేలా తీర్పును ఇవ్వాలని కోరారు.