రాష్ట్రీయం

తాత, నానే్న నాకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి చుండ్రు (నందమూరి) సుహాసిని 17వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ అభ్యర్ధిగా ఖరారు చేసిన వెంటనే ఆమె చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి హరికృష్ణను గుర్తుచేసుకున్నారు. టీడీపీకి ఆయన ఎంతో సేవ చేశారని, చిన్నప్పటి నుండి తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని, తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. తన మామ మాజీ ఎంపీ (చండ్రు శ్రీహరి) అని, ఆయన కూడా తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఆమె పెద్దిరెడ్డితోనూ, ఇతర సీనియర్ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడారు. కూకట్‌పల్లి నుండి గెలుపునకు సహకరించాలని కోరగా తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మాసాబ్‌ట్యాంకులోని హరికృష్ణ నివాసంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.