రాష్ట్రీయం

అవినీతి సొమ్ముతో గెలవాలనుకుంటున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: అవినీతి సొమ్ముతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. దళిత, బలహీన వర్గాలను మోసం చేశాయని చెప్పారు. టీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. బలహీన, దళిత వర్గాల సంక్షేమంకోసం పంచసూత్రాల పేరుతో అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోదీ, పాటుపడుతున్నారని అన్నారు. అంబేద్కర్‌ను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వకుండా కాంగ్రెస్ కుట్ర పన్నిందని, నెహ్రూ కోసం అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. మోదీ దళితుల ప్రేమతో అరుణతార లాంటి వాళ్లు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.