రాష్ట్రీయం

17 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస ఘడియలు 2019 జనవరి 14న ముగియనున్నాయి.
తిరుప్పావై పారాయణం
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ ఒకరు. ఈమెను నాచ్చియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ రంగనాథుడిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను తిరుప్పావై అంటారు. నాలాయిర దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తారు.