రాష్ట్రీయం

అసదుద్దీన్ వ్యాఖ్యలు సరికాదు: ఫరూఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి టీడీపీ రెండు స్థానాల్లో గెలుపుసాధించిన అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు సరికాదని వైద్య విద్యాశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ అన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలను టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మాణానికి పది కోట్లు రూపాయాల నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూములను పరిరక్షించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నాడు షాదీ ముబారక్, నేడు చంద్రన్న కానుక పేరుతో ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీగా ఒవైసీ తన బాధ్యతను మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందేనని, టీఆర్‌ఎస్‌కన్నా టీడీపీ ప్రభుత్వమే ముస్లింలను అభివృద్ధి చేసిందన్నారు.