రాష్ట్రీయం

వారానికి నాలుగు సార్లు కరీంనగర్- తిరుపతి రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 15: దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలోనడుస్తున్న కరీంనగర్‌తిరుపతి రైలు ఇకనుంచి వారానికి నాలుగు సార్లు నడవనుంది. ప్రస్తుతం వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుండగా, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ట్రిప్పులు పెంచేందుకు దక్షిణ మద్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్ సీ ఆర్ జీ ఎం వినోద్‌కుమార్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు రైల్వే అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. నగర పరిధిలోని తీగలగుట్టపల్లిలో గల లెవల్ క్రాసింగ్ వద్దరూ.102 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రైల్వే బోర్డు అనుమతిచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మనోహరాబాద్‌కొత్తపల్లి నూతన రైలు మార్గంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు వచ్చే ఏడాది మార్చి 21 వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు, గజ్వేల్ నుంచి కొత్తపల్లి వరకు డిసెంబర్ 31 2019 వరకు రైలు నడిపేలా పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.